జయంత్ మహాపాత్ర అంతర్జాతీయస్థాయి గుర్తింపు పొందిన కవి. సాధారణంగా ఆధునిక సమకాలీన ప్రపంచ కవిత్వసంకలనాల్లో భారతదేశానికి ప్రతినిధిగా ఎంచబడే ఒకరిద్దరు కవుల్లో ఆయన కూడా ఉంటున్నాడు. 85 సంవత్సరాల ఈ కవి తన ముఫ్ఫైఎనిమిదో ఏట కవిత్వరచన మొదలుపెట్టాడు.
అమృతం ప్రాకృతకావ్యం
పొద్దున్నే పాత కాగితాలు సర్దుకుంటుంటే ఎప్పుడో అనువాదం చేసిన ఈ ప్రాకృత కవితలు కనబడ్డాయి. ఇవి వజ్జాలగ్గంలోవి. క్రీస్తు శకం ఏడెమినిది శతాబ్దాల కాలంలో జయవల్లభుడనే జైనసాధువు సంకలనం చేసిన ప్రాకృత కవితకవితాసంకలనమది.
మొగలిపూలగాలి
నీళ్ళునింపుకున్న కడవల్లాంటి నల్లమబ్బులు నింగిలో కనబడగానే భారతీయకవులు లోనైన రసపారవశ్యంలో సంతోషం, దిగులు, ప్రేమించినవాళ్ళనుంచి ఎడబాటు, ఎడబాటు తీరుతుందన్న కోరిక-ఎన్నో భావాలు వ్యక్తం కావడానికి వాల్మీకి రామాయణంతోనే మొదలు.
