మునిపల్లె రాజు ఒక శతాబ్ది సమానుడు. తెలుగునేలను ప్రభావితం చేసిన సాహిత్య, సాంఘిక, సాంస్కృతిక ప్రభావాలన్నింటికీ ఆయన వారసుడు. ఆయన రచనలు చదువుతూ ఉంటే మనం ఒక మనిషినో, ఒక కుటుంబాన్నో కాదు, వందేళ్ళ సామాజిక పరివర్తనని దగ్గరనుంచి చూస్తున్నట్టుగా ఉంటుంది.
ఇష్ట కవిత్వం
ఎందుకంటే సాహిత్య చరిత్ర చదివి ఆధునిక పాశ్చాత్య కవిత్వం లేకపోతే ఆధునిక తెలుగు కవిత్వం లేదనుకుంటూ ఉన్నాం. కాని యూరపియన్ దుఃఖానికి మరీ అంతలా ఋణపడకుండానే తెలుగులో ఇంత అద్భుతమైన కవిత్వం వికసించిందని ఈ పుస్తకం మనకి స్పష్టంగా గుర్తుచేస్తోంది.
నా కవితలూ, నా పాఠకుడూ
వందేళ్ళకిందట పూర్వకాలపు కవులు పద్యాలు రాసుకున్నప్పుడు ప్రపంచమంతా వాటిని ఎలుగెత్తి పాడుకుంటుందనుకున్నారు