కవికీ పండితుడికీ మధ్య ఒక పచ్చికబయలు ఉంది. పండితుడు దాన్ని దాటాడా వివేకి అవుతాడు. కవి దాటాడా, ప్రవక్త అవుతాడు.
వెన్నెలకంటి రాఘవయ్య
మనుషులు సామాజికంగా విముక్తి చెందడానికి సాగించే పోరాటంలో మూడు దశలుంటాయి. మొదటి దశలో మేము కూడా మనుషులమే అని చెప్పుకోడానికీ, గుర్తింపు పొందడానికీ చేసే పోరాటం నడుస్తుంది. ఆ తర్వాతి దశలో తక్కిన మనుషులతో పాటు సామాజికంగా సమానావకాశాలకోసం పోరాటం నడుస్తుంది. మూడవదశలో వాళ్ళు తాము కూడా శ్రేష్ఠమానవులం కాగలమని పోరాడి నిరూపించే దశ ఉంటుంది.
హృదయానందం రెణ్ణాళ్ళ వేడుక
అమృత సంతానం ఆరాధకుల్లో మరొక రసజ్ఞుడు వచ్చి చేరాడు. కవిత్వ రసవాది నౌదూరి మూర్తి గారు అమృతసంతానం చదువుతున్నారనీ, ఆయన ఒక విశ్లేషణ రాయబోతున్నారనీ వాసు నన్ను కొన్నాళ్ళుగా ఊరిస్తో ఉన్నాడు. రాత్రి ఆ వ్యాసం చదువుతోంటే, ఈ వాక్యాలకు వచ్చేటప్పటికి నా హృదయం కొట్టుకోడం ఆగిపోయింది
