రూమీ గురించి నేను రాసిన నాలుగు మాటల్నీ మిత్రులు ఎంతో ఇష్టంతో చదవడం నాకు చాలా సంతోషానిచ్చింది. ముఖ్యంగా గోపరాజు వెంకటరమేష్ గారి ప్రతిస్పందనకి నేను కైమోడ్చకుండా ఉండలేకపోయాను. అయితే ఆయన రూమీ మాట్లాడిన ప్రేమ మనుషులకే పరిమితమా, తక్కినవాటికి అందులో చోటులేదా అనడిగారు
మాలతీచందూర్
నన్ను చాలా ప్రభావితం చేసిన రచయితల్లో మాలతీచందూర్ గారిని చెప్పుకోవాలి. ఆమె నన్ను మాత్రమే కాదు, కొన్ని తరాల్ని ప్రభావితం చేసిన రచయిత.ఆమె సాహిత్యజీవితం, పౌరజీవితం సారాంశమంతా ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగుసమాజాన్ని మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా సమాయత్తం చెయ్యడమేనని చెప్పవచ్చు.
కృష్ణలీలాస్మరణ
నా జీవితంలో కవిత్వం ప్రవేశించింది నా పసితనంలో. అయిదారేళ్ళ శైశవంలో మా ఊళ్ళో వేసవిరాత్రుల్లో ఆరుబయట నక్షత్రఖచిత ఆకాశం కింద మా బామ్మగారు భాగవత పద్యాలు చదువుతూండగా వినడం, గజేంద్రమోక్ష్జణం, రుక్మిణీకల్యాణం ఆమె నాతో కంఠస్థం చేయించడం నన్నొక అలౌకిక లోకానికి పరిచయం చేసాయి.
