రెజిన్ మాధ్యమం

మిత్రురాలు స్వర్ణలత తన సోదరి ఒక చిత్రకళా ప్రదర్శన ఏర్పాటుచేస్తోందనీ, ఆ ప్రారంభోత్సవంలో నన్ను కూడా ఉండమనీ అడిగితే వెళ్ళాను. నిన్న మధ్యాహ్నం ఐకాన్ ఆర్ట్ గాలరీలో ఆ ప్రదర్శనని నా మిత్రుడూ, సహాధ్యాయీ, ప్రస్తుతం తెలంగాణా ప్రభుత్వంలో డైరక్టరు జనరల్ ఆఫ్ పోలీసు గా ఉన్న మహేందర్ రెడ్డి ప్రారంభించారు. నా అత్మీయమిత్రుడూ, కవీ, గాయకుడూ సుద్దాల అశోక తేజ, కవి, చరిత్రపరిశోధకుడూ సిరామోజు హరగోపాల్ కూడా ఆ వేడుకలో పాలు పంచుకున్నారు.

అగస్టె రోడె

రోడే తన జీవితకాలం పొడుగునా స్త్రీదేహమనే ఒక రహస్యాన్ని, ఒక అద్భుతాన్ని, ఒక విభ్రాంతిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. చివరికి ఫ్రెంచి కెతడ్రల్ కూడా అతడికి మోకరిల్లి ప్రార్థన చేస్తున్న స్త్రీలానే కనిపించింది. ఆ వెతుకులాటలో, ఆ నలుగులాటలో, తన జీవితపు చివరిసంవత్సరాల్లో అతడికి శివుడు కనిపించాడు.

జీన్ లూయీ మొరెల్లి

నీటిరంగుల్ని అసాధారణమైన సామర్థ్యంతో సాధనచేస్తున్న సమకాలిక చిత్రకారులందరిలోనూ జీన్ లూయీ మొరెల్లి కి నేను పెద్ద పీట వేస్తాను.కొన్ని వందల ఏళ్ళుగా చీనా, జపాన్, భారతదేశంలోనూ, గత రెండు శతాబ్దాలుగా బ్రిటన్ లోనూ,అమెరికాలోనూ, వందేళ్ళుగా ప్రపంచమంతటా వికసిస్తూ వచ్చిన ఈ కళా ప్రక్రియను గత పాతికముఫ్ఫై ఏళ్ళుగా మొరెల్లి మనం ఊహించలేని ఎత్తులకి తీసుకుపోతూ ఉన్నాడు.