మరోసారి ఇల్లు మారాం

మరోసారి ఇల్లు మారాం. భారతీయ రచయితల్లో ప్రేమ్ చంద్ తర్వాత ఎక్కువ ఇళ్ళు మారింది నేనేనని రాళ్ళబండి కవితాప్రసాద్ అన్నాడు.రాజధాని మారిపోయే వేళ మళ్ళా ఇల్లు మారడమేమిటన్నారు కొందరు. కానీ మారక తప్పింది కాదు. ఎన్నాళ్ళు ఉంటామో కాని, ఇంటి చుట్టూ ఉన్న కొద్దిపాటి ఖాళీస్థలంలోనూ ఒక అందమైన పూలతోట పెంచుకోవచ్చన్న కోరిక నన్నూరించింది.

శోకం శ్లోకంగా మారిన మరోకథ

Poetry (2010) సినిమా చూసేటప్పటికి అర్థరాత్రి దాటిపోయింది.కొన్నాళ్ళ కిందట ఒక మిత్రురాలు చెప్పినప్పణ్ణుంచీ చూడాలనుకుంటున్నది నిన్నటికి చూడగలిగాను. సినిమా పూర్తయ్యేటప్పటికి, చెప్పలేని సంతాపమేదో హృదయాన్ని చుట్టుకుపోయింది. సినిమా అదృశ్యమైపోయింది. అప్పటిదాకా చూసిన దృశ్యాలన్నీ కలగలిసి ఒక బూడిదరంగు పొరలాగా మనసుమీద పరుచుకుపోయేయి.

మాధ్యమాలు

నా నీటిరంగుల చిత్రలేఖనం మీద పూజ్యులు గణేశ్వరరావుగారు నిన్న రాసిన మాటలు నాకెంతో సంతోషం కలిగించాయి. నా ఇరవయ్యేళ్ళ వయసులో నా కథలు చదివి కాళీపట్నం రామారావుగారు రాసిన ఉత్తరం నాకెంత స్ఫూర్తి కలిగించిందో, ఇప్పుడు ఈ మాటలు నాకంత ప్రోత్సాహాన్నిస్తున్నాయి. నా సాధన కొనసాగించడానికి మళ్ళా కొత్తగా ఒక ప్రోద్బలం దొరికింది.