ఇంతకీ విద్య మంచిదేనా?

మనిషి పుట్టుకతోటే విద్యావంతుడు. కాని ఆ విద్య అతడి మనసులో మరుగునపడిపోయి ఉంటుంది. గురువు చెయ్యవలసిన పని ఆ స్మృతిని మేల్కొల్పడం. గురువూ, శిష్యుడూ నిరంతరం వివేకరక్తులుగా సంభాషిస్తూ, సంభాషిస్తూ ఉండగా, ఒకనాటికి, ఒక హఠాత్ క్షణాన, ఆ స్మృతి నిప్పురవ్వలాగా విద్యార్థిలో మేల్కొంటుంది.

ప్రసంగకళని దాటిన మధురనిశ్శబ్దం

కవిత్వం మొదటిదశలో ప్రసంగం, రెండవ దశలో పద్యం. కాని మూడవ దశలో ప్రార్థనగా మారాలి. ప్రసంగదశలో కవి ఉన్నాడు, ప్రపంచముంది. రెండవ దశలో కవి ఉన్నాడు, ప్రపంచం లేదు, కాని కవి అంతరంగముంది. మూడవ దశలో కవి కూడా అదృశ్యమై కేవలం అంతరంగమొకటే మిగలవలసి ఉంటుంది. అప్పుడు, అటువంటి దశలో, పలికిన మాటలు మంత్రాలవుతాయి.

మేలిమి సత్యాగ్రాహి

1906 లో దక్షిణాఫ్రికాలో భారతీయుల పోరాటానికి గాంధీ కొత్త అస్త్రమొకటి కనుక్కున్నాడు. ఆ అస్త్రానికి పదునుపెట్టే క్రమంలో,మానవచరిత్రలో అటువంటి సత్యాగ్రాహులెవరైనా ఉన్నారా అని అన్వేషించినప్పుడు సోక్రటీస్ లో అతడికి అటువంటి మేలిమి సత్యాగ్రాహి కనిపించాడు.