కానీ ఏ రచయితైనా ముందు తన కోసం తన రాసుకుంటాడు. తనలోని ఒక శ్రోతను ఉద్దేశించి తను చెప్పదలుచుకున్నది చెప్పుకుంటాడు. తనలోని శ్రోత కనుమరుగవుతూ బయట శ్రోతలు రావటం ఏ రచయితకీ, ఏ రచనకీ ఆరోగ్యకరం కాదు.
పునర్యానం-44
ఏళ్ళ మీదట నెమ్మదిగా ఈ నగరం తన అంతరంగాన్ని నాతో పంచుకుంటున్నది అని అనిపించిన కొన్ని క్షణాలు ఉన్నాయి. కాని ఆ నగరం నలుగురికీ తెలిసిన నగరం కాదు. గజాల లెక్కన మనుషులు బేరమాడుకుంటున్న నగరం అస్సలు కాదు. అది మరొక నగరం. ఆ రెండో నగరంతో నాకు తెలీకుండానే నేను ప్రేమలో పడ్డానని తెలిసినప్పుడు రాసిన కవిత ఇది.
పునర్యానం-42
ఈ కవిత నాకొక కొండగుర్తు. ఎప్పటికేనా అటువంటి తావు ఒకటి నా జీవితంలో వెతుక్కుని నా చేతుల్తోనే నేనొక కుటీరాన్ని కట్టుకోవాలన్న కోరిక నాలో నానాటికీ బలపడుతూనే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే, అది నా యుటోపియా.
