ఆషాఢమేఘం-4

కాని వానాకాలం రాముడిలోని మనిషి బయటపడే కాలం. కాబట్టి రాముడే 'చూడు మనం చెప్పుకుంటున్న ఆ వానాకాలం సమీపించింది' అని అనడంలో కూడా గొప్ప ఔచిత్యం ఉంది. ఎందుకంటే ఆ వర్షర్తువర్ణన మొత్తం ఒక భావుకుడైన మానవుడు, అసలే రసార్ద్రహృదయుడు, మరింత రసార్ద్రభరితుడై చేసిన వర్షస్తోత్రంలాగా మనకి వినిపిస్తుంది.

ఆషాఢమేఘం -3

ఆషాఢమేఘం అనగానే కాళిదాసు మేఘసందేశం గుర్తుకు రావడం సహజం. ఈ దేశంలో కవులకీ, భావుకులకీ శతాబ్దాలుగా ఒక అభిరుచిని అలవరచడంలో, ఋతుపవనాన్ని ఒక శుభాకాంక్షగా మనం గుర్తుపట్టేలా చెయ్యడంలో మేఘసందేశ కావ్యం పోషించిన పాత్ర చిన్నది కాదు. కాని ఋతుపవనాన్ని ఒక కావ్యవస్తువుగా స్వీకరించడంలో, మనుషుల హృదయాల్ని మెత్తబరచడంలో, నింగినీ, నేలనీ ముడిపెట్టడంలో మేఘసందేశం తొలికావ్యం కాదు.

దశార్ణదేశపు హంసలు

'ఆ హంసలక్కడ ఉండేది కొన్నాళ్ళే'. ఈ వాక్యం చిన్నప్పణ్ణుంచి చదువుతున్నాను. కాళిదాసు ఈ మాట దశార్ణదేశపు హంసల గురించి రాసాడనే అనుకున్నాను ఇన్నాళ్ళూ. ఇప్పుడు తెలుస్తోంది, ఆ హంసలు నా ప్రాణాలేనని' అన్నారాయన తన డెబ్బై ఏళ్ళ అస్వస్థ శరీరాన్ని చూసుకుంటో.

Exit mobile version
%%footer%%