ప్రసిద్ధ ప్రచురణ కర్త ఎమెస్కో విజయకుమార్ వారి అబ్బాయి నరేన్ పెళ్ళివేడుక సందర్భంగా బాపు వేసిన కొన్ని బొమ్మల్ని కూడా ఒక గుత్తిగా పెళ్ళిపత్రికతో అందించాలనుకున్నాడు. ఆ బొమ్మల్ని చూస్తే భారతీయ కవులూ, యుగాలుగా ప్రవహిస్తున్న భారతీయ కవితాస్రోతస్వినీ కనిపించాయి. అందుకని ఆ బొమ్మలకోసం 5000 ఏళ్ళ భారతీయ కవిత్వం నుంచి కొన్ని మేలిమి కవితల్ని ఎంచి కూర్చిన సంకలనమే 'మనసున మనసై '