ఆ కోవలోనే కవితాప్రసాద్ వరంగల్ వాసం కూడా వస్తుంది. ఆయన అక్కడ ఉన్నప్పుడే భద్రకాళి అమ్మవారి గుడిలో ఒక రోజు ఆశువుగా ఒక శతకం చెప్పిన సంగతి విని ఇప్పటికీ వరంగల్ పరవశించిపోతూ ఉంటుంది.
కొండవీడు-2
కొండవీడులో చరిత్ర శిథిలాలు ఒక చిన్న అంశం మాత్రమే. ఆ కొండకొమ్ముల మీద తేలాడే ఆ మబ్బులముందు, మేఘాలముందు మనకి చరిత్ర గుర్తుకు రాదు. మీరు శ్రీనాథుడి కవిత్వం చదివి ఉంటే, ఆ పద్యాల్లోని loftiness ఎక్కడిదో తెలియాలంటే మాత్రం ఒకసారైనా కొండవీడు పోయి రావాలి.