ఆదివారం సంజీవదేవ్ శతజయంతి ఉత్సవాలు హైదరాబాదులో మొదలయ్యాయి. హైదరాబాదు స్టడీ సర్కిల్లో జరిగిన సమావేశంలో చాలామంది కవులు, కళాకారులు, పత్రీకాసంపాదకులు ఆయన్ని తలుచుకున్నారు.
మాలతీచందూర్
నన్ను చాలా ప్రభావితం చేసిన రచయితల్లో మాలతీచందూర్ గారిని చెప్పుకోవాలి. ఆమె నన్ను మాత్రమే కాదు, కొన్ని తరాల్ని ప్రభావితం చేసిన రచయిత.ఆమె సాహిత్యజీవితం, పౌరజీవితం సారాంశమంతా ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగుసమాజాన్ని మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా సమాయత్తం చెయ్యడమేనని చెప్పవచ్చు.
హీరాలాల్ మాష్టారు
నిన్న తెల్లవారు జాము నిద్రలో ఎందుకో ఫోన్ తడిమిచూసుకుంటే మెసేజి, విద్యారణ్య కామ్లేకర్ నుంచి, ఏ అర్థరాత్రి ఇచ్చాడో: 'భద్రుడూ, నాన్నగారు ఇక లేరు. 'అని. అది చూసినప్పటినుంచీ, నాలో ఒక పార్శ్వం చచ్చుబడిపోయినట్టే ఉంది.
