ఏడు ధర్మాలు

ఇక్కడ బుద్ధుడి రాజనైతికత మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన సామ్రాజ్యవాదాన్ని అంగీకరించలేకపోయాడనీ, గణతంత్రాల పట్లనే ఆయన హృదయం కొట్టుకుపోయేదనీ మనకి అర్థమవుతుంది. బహుశా, ప్రపంచంలో మరే ప్రవక్త, కవి, రచయిత, రాజకీయనాయకుడు కూడా ఇలా ప్రజాస్వామ్యపరిథిలోనే తనువు చాలించాలని కోరుకున్నవాళ్ళు మరెవరూ కనిపించరు.

సాంస్కృతిక వినమ్రత

అలా కొత్త పార్శ్వాలు తెరుచుకుంటున్నందువల్ల నీ ప్రపంచం మరింత విస్తృతమవుతోందనీ, నీ అనుభవం మరింత సుసంపన్నమవుతోందనే ఎరుక, అనిదంపూర్వమైన సంతోషాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం.

కరదీపిక

భారతరరాజ్యాంగ రూపకర్తలు గిరిజన ప్రాంతాల్లో 'శాంతి', 'సుపరిపాలన' ఉండాలని కోరుకున్నారు. వాళ్ళ వెనక నూటయాభై ఏళ్ళుగా రక్తంలో తడిసిన గిరిజన ప్రాంతాల జ్ఞాపకాలున్నాయి. 'శాంతి', 'సుపరిపాలన' అనే మాటలు వాడటంలో రాజ్యాంగ రూపకర్తలు ఎంతో వివేకాన్నీ, దూరదృష్టినీ కనపరిచారు.

Exit mobile version
%%footer%%