ఆ స్ఫూర్తి నానాటికీ బలపడుతున్నది

అందుకనే, మునుపెన్నటికన్నా కూడా నేడు గాంధీజీ స్ఫూర్తి మనకొక సామాజిక-నైతిక అవసరంగా మారుతున్నదని గ్రహిస్తున్నాను. అహింసని మనమింకెంత మాత్రం వ్యక్తి ధర్మంగా భావించి పక్కనపెట్టలేం. అన్నిటికన్నా ముందు అది జాతిధర్మం, దేశధర్మం, ప్రపంచధర్మంగా మారవలసి ఉంది. గాంధీజీ అన్నిటికన్నా ముందు అహింసావాది, ఆ తర్వాతే జాతీయోద్యమవాది, సంస్కర్త, మరేమైనా.

సాంస్కృతిక వినమ్రత

అలా కొత్త పార్శ్వాలు తెరుచుకుంటున్నందువల్ల నీ ప్రపంచం మరింత విస్తృతమవుతోందనీ, నీ అనుభవం మరింత సుసంపన్నమవుతోందనే ఎరుక, అనిదంపూర్వమైన సంతోషాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం.

కరదీపిక

భారతరరాజ్యాంగ రూపకర్తలు గిరిజన ప్రాంతాల్లో 'శాంతి', 'సుపరిపాలన' ఉండాలని కోరుకున్నారు. వాళ్ళ వెనక నూటయాభై ఏళ్ళుగా రక్తంలో తడిసిన గిరిజన ప్రాంతాల జ్ఞాపకాలున్నాయి. 'శాంతి', 'సుపరిపాలన' అనే మాటలు వాడటంలో రాజ్యాంగ రూపకర్తలు ఎంతో వివేకాన్నీ, దూరదృష్టినీ కనపరిచారు.

Exit mobile version
%%footer%%