ఆ చిత్రాన్నట్లానే చాలాసేపు తదేకంగా చూస్తూండిపోయాను. ఆ పడుచుని చిత్రిస్తున్నప్పుడు చిత్రకారుడు ఆమె యవ్వనం మీద కన్నా ఆమె ముగ్ధత్వం మీదనే దృష్టిపెట్టాడని తెలుస్తూ ఉండింది.
ప్రేమలోనూ, కళలోనూ
ఒక పట్టణం మహానగరంగా మారిందని ఎప్పుడు చెప్పగలం? ఆ ఊళ్ళో నీటిరంగుల చిత్రలేఖనసామగ్రి దొరికినప్పుడు అని చెప్తాన్నేను.
మనోజ్ఞస్వప్నాలు
శతాబ్దాలకిందటి ఏ పారశీక కళాకారులో, చిత్రకారులో అతడితో నిత్యం సంభాషణ కొనసాగిస్తూ ఉంటారనుకుంటాను. ఇక్కడ పొందుపరిచిన రెండుమూడు నమూనాలు చూడండి. ఆ నెమలి, ఆ ఏనుగు, ఆ కొంగలు- ఇవి కాగితం మీద గీసిన బొమ్మలు కావు, చెక్కమీద చెక్కిన శిల్పాలు, ఇంకాచెప్పాలంటే పాలరాతిమీద ముద్రించిన మనోజ్ఞస్వప్నాలు.
