ఆయన ఆ సందర్భంగా మా వాడితో 'ప్రసిద్ధ జాతీయ నాయకుల గురించి మాట్లాడేవాళ్లూ, వారిని పట్టించుకునే వాళ్ళూ ఎవరో ఒకరు ఉన్నారు. కానీ మీరు ఇక్కడ ప్రదర్శిస్తున్న ఈ విస్మృత వీరుల గురించి మాట్లాడడానికి మీరు తప్ప వాళ్ళకి మరెవరూ లేరు' అన్నారు.
ఊర్వశీయం
ఈ నాటకం పైకి కనిపిస్తున్నంత సరళంగానూ సులభంగాను ఉన్న కథ కాదనీ, ఈ నాటక ఇతివృత్తంలో సార్వజనీన, సార్వకాలిక సమస్యలు లోతుగా సంక్లిష్టంగా ఉన్నాయని ఓల్గా గారు అన్నారు.
పాలమూరు అడవిదారిన-2
కాని మాఘమాసపు అడవి ఉందే, అది పూర్తిగా అంతర్ముఖీన భావుకత. తనలోకి తాను ఒదిగిపోయి ఉండే ఒక జెన్ సాధువు అంతరంగంలాంటిది. ఒక యోసా బూసన్ హైకూ లాంటిది, సంజీవ దేవ్ పేస్టల్స్ చిత్రలేఖనం లాంటిది. ఏక్ తార మీటుకుంటూ పాడుకునే బైరాగి తత్త్వం లాంటిది.
