రాయరత్న మంజూష

షేక్ స్పియర్ మీద ప్రతి ఏడాదీ కొత్త అధ్యయనాలు వచ్చినట్టే ఆముక్తమాల్యద మీద కూడా ప్రతి ఏడూ ఒక కొత్త పుస్తకం రావాలి. తెలుగునాట ప్రతి పట్టణంలోనూ కనీసం ఒకసారేనా రసజ్ఞులు నలుగురూ కూచుని ఆ కావ్యాన్ని కలిసి చదువుకోవాలి. అందులోని ఋతువర్ణనలకి ఎప్పటికప్పుడు ఇంగ్లిషులో, హిందీలో ఇతరభాషల్లో ఎప్పటికప్పుడు కొత్త అనువాదాలు రావాలి.

యుగయుగాల చీనా కవిత-24

కాలంలో వస్తున్న మార్పుని అందరికన్నా ముందు చిత్రకారుడు, ఆ తర్వాత సంగీతకారుడూ, ఆ తర్వాత కవీ పట్టుకుంటారు. తాత్వికుడూ, సోషియాలజిస్టూ, కాలమిస్టూ ఆ తర్వాతే దాన్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ ఆ కవి శబ్దవర్ణచ్ఛాయలతో కవిత్వం పలికేవాడూ, ఆ కవితలో ఆ భాషకే సొంతమైన స్వరాల్నీ, ధ్వనుల్నీ పట్టుకోగలిగేవాడూ అయితే, ఇంక చెప్పవలసిందేముంది!

శీలా వీర్రాజు

వీర్రాజు గారిని ఆ తర్వాత ఎప్పుడు చూసినా ఆ తొలినాళ్ళ అద్భుత భావన, ఆరాధభావన నన్ను వెన్నాడుతూనే ఉండేవి. ఇరవయ్యేళ్ళ కిందట వాళ్ళింటికి వెళ్ళాను. అది ఇల్లు కాదు, ఒక కళాకృతి. ఒక అపురూప చిత్ర, శిల్ప సంచయశాల. మళ్ళీ అదే ఆశ్చర్యానుభూతి.

Exit mobile version
%%footer%%