ఇంద్రనీలస్మృతి

'ఉషోదయాన్ని ఎవ్వడాపురా? నిశావిలాసమెంతసేపురా? నెత్తురుంది, సత్తువుంది, ఇంతకన్న సైన్యముండునా!' అన్నాడు సీతారామశాస్త్రి.

బన గర్ వాడి

ఇన్నాళ్ళకు మరొకసారి బనగర్ వాడి చదివాను. దాదాపు నలభై అయిదేళ్ళ తరువాత. ఆ పసిప్రాయంలో నన్నంతగా లోబరుచుకున్న ఆ ప్రాశస్త్యం ఆ నవలదా లేక అప్పటి నా నిష్కళంక హృదయానిదా లేక తాడికొండ పాఠశాలదా అని పరిశీలనగా చదివాను. అదంతా ఆ కథలోని నైర్మల్యమని నాకిప్పుడు బోధపడింది.

కథలు కూడా అంతే అవసరం

నేనూ రచయితనే కాబట్టి, సరిగ్గా, అప్పుడే, ఆ కథకి ఆ చిన్నారి బాలికలు ఏమి మలుపు ఇవ్వబోతున్నారని కుతూహలంగా ముందుకు వంగి ఆసక్తిగా మరు సన్నివేశం కోసం చూపు సారించాను. ఆ పైన చెప్పబోయే వాక్యాల కోసం ఆతృతగా చెవులు రిక్కించాను.