మట్టిమనిషి

ఆ నాటకం చూస్తున్నంతసేపూ, ఆ కథాంశానికి కాలం చెల్లలేదనీ, ఇప్పుడు మన సమాజంలో మట్టిమనిషి వెర్షన్ 2.0 నడుస్తోదనీ నాకు పదే పదే అనిపించింది. ఇప్పుడు సాగుభూమిని సినిమహాలుగా మార్చి పెట్టుబడిని రెండింతలు, మూడింతలు చేసుకోడం మీద కాదు, ఆ భూమిని ఒక రియల్ ఎస్టేట్ పాచికగా మార్చి పెట్టిన పెట్టుబడిని రాత్రికి రాత్రే పదింతలు చేసుకోవాలనే రాక్షసదురాశ ఆవహించిన కాలంలో ఉన్నాం.

దిమ్మరి

కాని ఈ పుస్తకం వేరు. ఇందులో విరాగి కాదు, రాగమయి కనిపిస్తుంది. ఒక ప్రేమసముద్రాన్ని గుండెలో మోసుకుంటూ తిరుగుతున్న ప్రేమికురాలు కనిపిస్తుంది. ఒక తల్లి కనిపిస్తుంది, ఒక చెల్లి, ఒక అక్క, ఒక క్లాస్ మేట్, ఒక సహచరి, ఒక క్షమామూర్తి, చివరికి, 'నగ్నపాదాలు 'అనే రచనలో ఆమె కోపం కూడా కనిపిస్తుంది.