ఆంధ్ర గద్య చంద్రిక

తెలుగులో పద్య సంకలనాలు ఉన్నట్లుగా గద్య సంకలనాలు చాలా తక్కువ. తెలుగు కవిత్వాన్ని 'కావ్యమాల' (1959) పేరిట సాహిత్య అకాదెమీ కోసం కాటూరి వెంకటేశ్వర రావుగారు ఒక సంకలనం తీసుకొచ్చారు. అయితే అందులో కవుల ఎంపిక, పద్యాల ఎంపిక మొత్తం మల్లంపల్లి శరభయ్యగారే చేసారు.

ఆ బంభర నాదం

అలా ఒక రసజ్ఞుడు ఎలుగెత్తి, మేఘగంభీర స్వరంతో పద్యాలు చదువుతోంటే, భయంతో, భక్తితో, వినమ్రతతో అట్లా ఆ రోజు రాజమండ్రి ఆ ఉద్గాత ముందు చెవి ఒగ్గినిలబడిపోయినట్టుగా ఇప్పుడు ఏ పట్టణమేనా చెవి ఒగ్గడానికి సిద్ధంగా ఉందా? ఏమై పోయింది ఆ కాలం? ఆ రసజ్ఞులు? తే వందినః? తాః కథాః?

సంస్కార కర్పూరకరండం

ఒకప్పుడు ఉజ్జయినిలో ఉదయన పండితులుండేవారని కాళిదాసు గుర్తుచేసుకుంటాడు. సన్నిధానం అటువంటి రాజమండ్రి పండితుడు. దాదాపు వందా, నూట యాభయ్యేళ్ళ రాజమండ్రి సాహిత్య, సాంస్కృతిక చరిత్ర అతడికి కంఠోపాఠం. ఆ ముచ్చట్లు ఆయన చెప్తుంటేనే వినాలి. ఒకప్పటి రాజమండ్రిగురించి మాట్లాడటం మొదలుపెడితే ఆయన మొత్తం దేహంతో మాట్లాడతాడు. మాటమాటకీ గుండె గొంతులోకి ఉబికి వచ్చేస్తుంది.