జరొస్లావ్ సీఫర్ట్ చెక్ కవి. 1984 లో కవిత్వానికి గాను నోబెల్ పురస్కారం పొందాడు. ఆయన కవిత్వానికి The Poetry of Jaroslav Seifert (1998) పేరిట ఎవాల్డ్ ఓసెర్స్ చేసిన అనువాదంలో కొన్నాళ్ళుగా మునిగితేలుతున్నాను. ప్రతి రాత్రీ నిద్రలోకి జారుకునేముందు ఒకటిరెండు కవితలేనా చదవడం కొత్తసుగంధాల్నీ, పాతప్రణయాల్నీ మరొకసారి చేరదీసుకోవడం లాగా ఉంది.
యాంటిగని
0 టివి ప్రేక్షకులకోసం ప్రతి ఆదివారం అక్షరం కార్యక్రమంలో ( మ. 12.30 కి ) ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్నాను. ఒక వారం కవిత్వం,ఒక వారం నవల, ఒకవారం నాటకం ఇట్లా. ఈసారి సోఫోక్లిస్ రాసిన 'యాంటిగని ' నాటకాన్ని పరిచయం చేసాను.
ప్రకాశమాన అస్తిత్వాలు
నా పారాయణ గ్రంథాల్లోకి చెస్లావ్ మిలోష్ 'ఎ బుక్ ఆఫ్ లూమినస్ థింగ్స్ ' (1996) చేరి చాలాకాలమే అయింది. మిలోష్ (1911-2004)పోలిష్ కవి, ఇరవయ్యవ శతాబ్దపు ప్రపంచమహాకవుల్లో మొదటి వరసకు చెందినవాడు. రెండు ప్రపంచయుద్ధాలతో పాటు, నాజీ దురాగతాల్నీ, స్టాలిన్ అకృత్యాల్నీ కూడా సమానంగా చూసినవాడు.
