కొండగాలి, కడలినీలిమ

సంటొక తనేద (1882-1940) ఇరవయ్యవ శతాబ్దానికి చెందిన సైగ్యో, ర్యోకాన్, బషొ అని చెప్పవలసి ఉంటుంది. ఆ పూర్వజపాన్ మహాకవుల దారిలోనే అతడు కూడా ఒక పరివ్రాజక కవిగా జీవించాడు. మొత్తం జపాన్ అంతా, ముఖ్యంగా గ్రామీణ జపాన్ అంతా కాలినడకన, సంచరించాడు.

హాన్ షాన్

ఆయన్ని చివరిసారి కొండలమీదనే చూసారనీ, ఒక కొండనెర్రె విచ్చుకుని అందులోనే ఆయన అదృశ్యమైపోయాడనీ ఐతిహ్యం. ఒక్కటి మటుకు స్పష్టం. కవీ, కొండా ఒకటైపోయిన ఇటువంటి ఉదాహరణ ప్రపంచసాహిత్యంలోనే మరొకటి లేదు.

ప్రకృతి, సంస్కృతి

కాని కొకింషు కవులు ఆ పూలు పూయటాన్నీ, రాలిపోవటాన్నీ జపాన్ జీవితంలో భాగంగా మార్చేసారు. వేల ఏళ్ళుగా రాలుతున్న పూలని చూస్తూ, ఆ కవితల్ని తలుచుకుంటూ, తిరిగి తాము కూడా కవితలు చెప్తూ జపనీయ జాతి సుసంస్కృతమయ్యే విద్య నేర్చుకుంటూ ఉంది.

Exit mobile version
%%footer%%