ఈ ఒక్క కథ అనే కాదు, దాదాపుగా చాలా కథలు నాకు పదేపదే ప్రేమ్ చంద్ ని గుర్తుకు తెస్తూ ఉన్నాయి. పుస్తకం చదవడం ముగించేక, 2013 లో ఆయన వెలువరించిన 'ఏక్ కహానీ కే తీన్ రంగ్' కి నేను రాసిన ముందుమాట మరోసారి తీసి చదివాను. ఆశ్చర్యంగా అప్పుడు కూడా నాకు ప్రేమ్ చంద్ గుర్తొస్తున్నాడనే రాసాను. అంటే నా అనుభూతి నిక్కమైనదేన్నమాట. నా epiphany స్థిరంగానే ఉందన్నమాట!
చలంగారూ, జగ్గారావూ
కానీ మొన్న ఒక పుస్తకావిష్కరణ సభకి పిలిస్తే ఇదే చెప్పాను: మీరు నిజంగా మీ హృదయం ఏమి చెప్తోందో దాన్నే రాయదలుచుకుంటే, మీకు ఒక్క పబ్లిషరు కూడా దొరక్కూడదు, ఒక్క పాఠకుడు కూడా మీకు తన స్పందన చెప్పకూడదు అని. ఎందుకంటే పబ్లిషరు అంటూ ఒకడు దొరగ్గానే మీ రచన ఒక పెట్టుబడివస్తువుగా మారిపోతుంది.
మనిషి కోసం అన్వేషణ
ఈ కవితలు బాలాజీ శిశుహృదయంతో రాసాడు కాబట్టే ఇందులో అధికభాగం కవితలు, అమ్మ గురించీ, తన పిల్లల అమ్మ గురించీ, తనకి అమ్మగా మారిన తన పిల్లల గురించీ ఉండటంలో ఆశ్చర్యం లేదు. స్త్రీల గురించీ, తనని కడుపులో పెట్టుకుని చూసుకున్న తన తల్లి, సహచరి, కూతురుల గురించి కవి మాట్లాడినప్పుడల్లా మన హృదయంలో కూడా ఒక తంత్రి మృదుమధురంగా మోగడం మనకి వినబడుతుంది.
