ఎన్నేళ్ళయింది మృగశిర కార్తె అడుగుపెట్టిన రోజునే తొలకరి జల్లు పలకరించి! జల్లు కూడా కాదు, సముద్రమే ఆకాశం మీంచి ప్రయాణిస్తున్నట్టుంది! ఋతుపవనమేఘమిట్లా అడుగుపెట్టవలసిననాడే అడుగుపెట్టడం కన్నా భారతీయ ఆకాశానికీ, భారతీయ సుక్షేత్రానికీ శుభవార్త మరేముంటుంది! అంతకన్నా సత్యం, శివం, సౌందర్యమేముంటుది!
జెండా కొండ
ఆదివాసులకి కొండ ఒక అఖండ జీవపదార్థమని నా మిత్రుడూ, గిరిజన సాహిత్యవేత్తా డా.శివరామకృష్ణ రాసాడు. 'పండితారాధ్య చరిత్ర''లో 'పర్వత ప్రకరణం'లో శ్రీశైలం గురించి రాస్తూ, 'అకృతాత్ములకు శిలా నికరమై తోచు/సుకృతాత్ములకు లింగ నికరమై తోచు 'అన్నాడు పాల్కురికి సోమన.
రెండువారాల పాటు మా ఊళ్ళల్లో
చాలా కాలం తర్వాత రెండువారాల పాటు మా ఊళ్ళల్లో తిరుగాడేను.నేను పుట్టిన ఊరితోనూ, ఆ ప్రాంతంతోనూ నేను మానసికంగా ఎంతగా అతుక్కుపోయేనంటే,నేను మరేదీ కోరుకోలేకపోయాను. విద్యలోనూ, ఉద్యోగంలోనూ బహుశా ఏదైనా సాధించిగలిగి ఉండేవాణ్ణేమోగాని, ఎప్పటికప్పుడు నా హోం సిక్ నెస్ నన్ను వెనక్కి లాగేస్తూనే వచ్చింది.
