బహుశా కథ మొదలయిన తర్వాత, పాత్రలు నా మాట వినకపోవచ్చు. నేనే ఒక ప్రేక్షకుడిలాగా ఆ పాత్రల గమనాన్ని నిశ్చేష్టుణ్ణై చూస్తూండవచ్చు. కాని నాకు తెలియవలసింది, ఆ స్థలం, ఆ కాలం, ఆ వెలుగునీడలు.
బాధలన్నీ పాతగాథలై
ఎందుకంటే, పరుగుపరుగున రైల్వేస్టేషన్ చేరుకుని ఊపిరి ఎగబీలుస్తూ కంపార్ట్ మెంట్లో చొరబడి, మన సీటు ఎక్కడుందో వెతుక్కుని సూట్ కేసో, బాగో పైకో, కిందకో నెట్టేసి, అప్పుడు, సరిగ్గా అప్పుడే ఒక్కక్షణం మనం గాఢంగా ఊపిరి పీలుస్తాం చూడండి, అట్లాంటి క్షణమే కవిత్వం.
ఆ రెండూ కలిసి ఒక జ్ఞాపిక
ఇప్పుడు కృష్ణా జిల్లా రచయితల సంఘంవారు 2015 సంవత్సరానికి ఆలూరి బైరాగి పురస్కారం నాకు అందించినప్పుడు మళ్ళా అట్లానే అనిపించింది. ఆ సంకల్పం లక్ష్మీప్రసాద్ గారిదో, పూర్ణచంద్, గుత్తికొండ సుబ్బారావుగార్లదో అనుకోవడం లేదు నేను.
