1967-71 ప్రాంతాల్లో శ్రీకాకుళం గిరిజనప్రాంతాల్లో తలెత్తిన తిరుగుబాటు, అలజడీ పార్వతీపురం గిరిజన ప్రాంతాల్లోనే ప్రధానంగా సంభవించేయి. ఆ తర్వాత ఇరవయ్యేళ్ళ్ళకి, అంటే, 1987 లో నేను జిల్లా గిరిజనసంక్షేమాధికారిగా ఉద్యోగంలో చేరినప్పుడు పార్వతీపురం గిరిజనప్రాంతాల్లోనే ట్రైనింగూ, మొదటి పోస్టింగూ కూడా. అక్కణ్ణుంచి అనూహ్యపరిస్థితుల్లో 1990 లో ఆ జిల్లా వదిలిపెట్టి వచ్చేసినదాకా,ఆ అడవుల్లో నేను తిరగని చోటులేదు, ఎక్కని కొండలేదు.
ఆంధ్రీకుటీరం చేస్తున్న విద్యావితరణ
ప్రపంచం రెండు విధాలుగా ఉంది. చుట్టూ ఉన్న వ్యవస్థల్ని విమర్శిస్తూ వుండే ప్రపంచమొకటి. 'చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూచోకుండా ప్రయత్నించి చిన్నదీపమేనా వెలిగించే' వాళ్ళ ప్రపంచం మరొకటి. కిరణ్ మధునాపంతుల ఈ రెండో తరహా ప్రపంచానికి చెందిన మనిషి.
ఈశవిద్య
నేను సద్గురు జగ్గీవాసుదేవ్ అనుయాయిని కాను, ఆయన బోధనలపట్లా, సంభాషణలపట్లా నాకేమీ ప్రత్యేకమైన ఆసక్తి లేదు. ఆయన చెప్పే క్రియాయోగాన్ని అనుసరించడానికి ఆయన పట్ల గొప్ప నమ్మకం ఉండాలి, లేదా ఆయన్ని విమర్శించాలంటే, ఆయన ప్రత్యర్థుల్లాగా, ఆయన పట్ల బలమైన అనుమానాలేనా ఉండాలి. నాకు ఆ నమ్మకమూ లేదు, ఆ అనుమానాలూ లేవు.
