కవిత్వం ఇలానే రాయాలని ఎప్పటికీ ఎవరికీ చెప్పలేం. కవిత్వం లీగల్ డాక్యుమెంటు కాదు, రాజకీయ పార్టీలు సమావేశాలు అయిపోయిన తర్వాత బయట మీడియా పాయింట్ దగ్గర ప్రెస్ కి వివరించడంకోసం రాసిపెట్టుకునే ప్రెస్ నోట్ కాదు. కవిత్వంలో ఆచి తూచి పదాలు వాడతాము కానీ, అది వేరే తరహా 'మెమొరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్'. కవిత్వం ఒక మనిషి తన వ్యక్తావ్యక్తాల్ని రెండు చేతుల్తోనూ బాలన్స్ చేసుకునే ప్రక్రియ.
మరొకసారి అడవిదారుల్లో
ఆ గిరిజన గ్రామంలో ఆ పెంకుటిళ్ళు, ఆ మట్టి అరుగులు, ఆ పరిశుభ్ర, ప్రశాంత వాతావరణం చూడగానే ఎప్పట్లానే నా మనసు అక్కడే ఉండిపోవాలని కొట్టుకుపోయింది. ఆ అరుగులమీద కూచుని భాగవతమో, బుద్ధుడి సంభాషణలో, స్పినోజా లేఖలో చదువుకోవడం కన్నా జీవితంలో ఐశ్వర్యమేముంటుంది అనిపించింది.
గిరిజన సాహిత్యం
తెలుగు రాష్ట్రాల్లో గిరిజన, భాషా సాహిత్యాల మీద సాహిత్య అకాడెమీ విశాఖపట్టణంలో 26, 27 వ తేదీల్లో రెండు రోజుల సదస్సు నిర్వహించింది. ఒక భాషా ప్రాంతానికి చెందిన గిరిజనుల సాహిత్యం మీద ఒక సదస్సు నిర్వహించడం అకాడెమీ చరిత్రలోనే ఇది మొదటిసారి అని విన్నాను. ఆ సదస్సులో సమాపన ప్రసంగం చేసే గౌరవం నాకు లభించింది.
