విప్లవాత్మక జాతీయవాది

సరిగ్గా ఆ వైఖరిమీదనే, ఆ రాజీపడటం మీదనే సుభాష్ తన అస్త్రాల్ని ఎక్కుపెట్టాడు. ఆ విమర్శలో ఎంతదాకా వెళ్ళాడంటే, మారిన పరిస్థితుల్లో సరికొత్త జాతీయోద్యమాన్ని నిర్మించే శక్తి గాంధీకి లేదనీ, ఒకటి ఆయన వయోభారం, రెండవది, ఆయన శాంతిదూత కావడం అని కూడా అన్నాడు. .

యుగయుగాల చీనా కవిత-23

తమని స్పందింపచేసిన ఆ క్షణాల్ని ఒక కవితగా కూర్చగలిగితే ఆ మనిషి, విద్యావంతుడనీ, సాంస్కృతికంగా పరిణతి చెందినవాడనీ గుర్తు. తన అభిరుచి ఉన్నతమైందని తెలుపుకోడానికీ, తాను జీవించిన క్షణాలు చిరస్మరణీయాలూ, సామాజికంగా ప్రభావశీలాలూ అని చెప్పుకోడానికి ప్రతి మనిషీ ఉవ్విళ్ళూరేవాడు. ఆ ఉద్వేగంలో కవిగా మారేవాడు. అలా ఒకరికొకరు పంచుకున్న ఆ కవితలు అనతికాలంలో సాహిత్యంగా మారిపోయేవి.

ఒక భారతీయ తీర్థయాత్రీకుడు

23 ఏళ్ళ ఒక యువకుడు ఇటువంటి వాక్యాలు రాసాడంటే నమ్మశక్యంగా ఉండదు. కాని ఇటువంటి వాక్యాలు రాసాడుకనుకనే మరొక ఇరవయ్యేళ్ళ తరువాత ఆయన చరమ భారత స్వాతంత్య్ర సంగ్రామాన్ని మొదలుపెట్టగలిగాడు.