తాను శతాధికంగా రచనలు చేసినప్పటికీ తన పేరు శివతాండవంతో పెనవేసుకుని ఉండటం భగవంతుడు చేసిన చిత్రమని నారాయణాచార్యులుగారు రాసుకున్నారు. అది సంగీతం, నాట్యం, గానం, కావ్యం. శబ్దంతో చెక్కిన శిల్పం.
తొలి తెలుగు శాసనం
ఇవాళ ఏ కార్యాలయంలోనూ కూడా తెలుగులో ఒక ఉత్తరం కూడా రాయడానికి సిద్ధంగా లేని మనం దాదాపు పదిహేను శతాబ్దాల కిందట దానశాసనాన్ని నలుగురూ చదివేలా తెలుగులో చెక్కించిన ఆ రాజుల్నీ, ఆ పాలననీ ఏమని ప్రశంసించగలుగుతాం!
