అందుకని ఈసారి మురళి పిలిచినప్పుడు మూగెన్నను చూడటం కన్నా బయ్యన్నను చూడటం మీదనే నాకు ఎక్కువ ఆసక్తి ఉండింది. దేవుడూ, మనిషీ కలిసి అంతదగ్గరగా గడపడం ఒక్క ఆదిమసమాజాల్లోనే సాధ్యమనిపిస్తుంది.
మాయగీతము
లోరెలీ జర్మన్లో రైన్ నది ఒడ్డున ఉన్న ఒక నిటారు పర్వతశిఖరం. మర్మరమంగా ధ్వనించే శిఖరం అని దాని అర్థం. ఆ కొండ పక్కన ఆ నదిలో ఎన్నో నావలు సుడిగుండంలో చిక్కుకుని మునిగిపోయాయి. ఆ కొండమీద ఒక సుందరి ఉండి పాటలు పాడుతూ ఉంటుందనీ, పడవనడిపే వాళ్ళు ఆ పాట వింటూ దారితప్పి మరణిస్తుంటారనీ స్థానిక కథనం.
సిద్ధౌషధం
కవిగా ఆయన సర్వోన్నతుడు, కాని మనిషిగా బలహీనుడు, ఎంత మహావిషాదాన్ని చూసినా కూడా తన జీవితేచ్ఛ చల్లారని వాడు. 'పొద్దుటిపూట దీపంలాగా ఏ క్షణాన్నైయినా కొండెక్కేలాగా ఉంది' తన జీవితమని ఒక ఉత్తరంలో రాసుకున్నాడుగాని, ఆ నిశాంతవేళ కూడా సాయంసంధ్యాదీపంలాగా ప్రజ్వరిల్లాలనే తపించాడు.
