ఒంటిగా ఉయ్యాలలూగితివా

పద్యం నిర్మించడం కన్నా పాట కట్టడం చాలా కష్టం. అందుకనే ప్రజలు గుర్తుపెట్టుకునేది పాటలు కట్టేవాళ్ళని మాత్రమే. అందులోనూ, తనదైన సొంతగొంతుతో పాటకట్టేవాళ్ళు ఏ భాషలోనైనా కొంతమందే ఉంటారు. బసవరాజు అటువంటి కవి.తెలుగులో ప్రసిద్ధి చెందిన ఎన్నో గీతాలకూ, కవితలకూ మూలవాక్కు ఆయన కవితల్లో కనిపిస్తుంది.

వినయపత్రిక

వినయపత్రికలో ఏ కీర్తన తెరిచినా ఇలా గంగ మన బల్లమీద ప్రవహిస్తున్నట్టే ఉంటుంది. పుస్తకం పుటల్లోంచి సూర్యోదయం సంభవిస్తున్నట్టే ఉంటుంది. నీ రెండు భుజాల మీదా రెండుకోకిలలు, ఒకటి వాల్మీకి కోకిల, మరొకటి తులసీ కోకిల గొంతెత్తి కూస్తూనే ఉన్నట్టుంటుంది.