రకరకాల ఈ కథలన్నీ చెప్పే సారాంశమొకటే. చండీదాస్ ఒక స్తీతో ప్రేమలో పడ్డాడు, ఆ ప్రేమ కోసం తన శిరసునే మూల్యంగా చెల్లించాడనే.
అచ్చమైన తెలుగు కవిత్వం
ఒకప్పటి పాకనాటిసీమ పల్లెటూరి జీవితం, ఆ రైతులు, గోపాలకులు, ఆ పశువులు, ఆ అడవులు, ఆ పొలాలు, ఆ సంతోషాలు, ఆ భయాలు అవన్నీ మొదటిసారి తెలుగు కవిత్వంలోకి ప్రవేశించాయి. ప్రాజ్ఞన్నయ యుగంలో శాసనాలకు పద్యాల్ని ప్రసాదించిన గుండ్లకమ్మ ఒడ్డున ఇప్పుడు మట్టివాసనలీనే అచ్చమైన తెలుగు కవిత్వం ప్రభవించింది.
ఏమై పోయాయి ఆ పద్యాలు?
ఎటువంటి పద్యం! ఎటువంటి ఛందస్సు! పండరంగడు జైనుడు. తెలుగుని పద్యభాషగా తీర్చిదిద్దినవాళ్ళూ, తెలుగు ఛందస్సు రూపకర్తలూ జైనులే అనడంలో సందేహం లేదు. ఏమై పోయాయి ఆ పద్యాలు? ఆ కావ్యాలు? ఎక్కడ అదృశ్యమైపోయారు ఆ రసజ్ఞసమూహాలు?
