శ్రీవేంగడం

ఒకసారి శ్రీవేంకటనాథుడు తెలుగు కవుల్ని ఆకర్షించడం మొదలుపెట్టాక అన్నమయ్య వంటి మహాభక్తుడూ, శ్రీకృష్ణదేవరాయల వంటి చక్రవర్తి మాత్రమే కాదు, మరెందరో కవులు తుమ్మెదలై ఆ పద్మనాభుడి చుట్టూ పరిభ్రమిస్తూనే ఉన్నారు.

పెదకళ్ళేపల్లి

ముప్పై ఏళ్ళు పైబడి ప్రభుత్వంలో పనిచేస్తున్నాను. కాని తనకి వచ్చిన అర్జీ మీద ఒక పద్యంతో ఎండార్స్మెంటు రాయవచ్చునని తెలిసినవాడు నాతో సహా ఒక్క అధికారి కూడా లేడు!