దీర్ఘాసి విజయభాస్కర్ కవిగా, రచయితగా, నాటకకర్తగా, సమర్థుడైన అధికారిగా ఇప్పటికే తెలుగుప్రపంచానికి పరిచయం. ఎన్నో ప్రతికూల పరిస్థితుల్ని దాటి ఆయన ఈ స్థితికి చేరుకోవడమే ఒక జయగాథ, అతడు పుట్టిపెరిగిన ప్రాంతానికీ, ఆ కుటుంబాలకీ మాత్రమే కాదు, మనందరికీ కూడా. కానీ అతడు ఇంతదాకా అధిరోహించిన ఎత్తులు ఒక ఎత్తు. ఈ పుస్తకం ద్వారా చేపట్టిన ఆరోహణ మరొక ఎత్తు.
మోహనరాగం: ఉపనిషత్తులు
ఈ జీవితంలో మనిషి కోరుకోవలసినవి అభయం, ఆనందం, అమృతం అంటున్నాయి ఉపనిషత్తులు అని అంటున్నారు వాడ్రేవు చినవీరభద్రుడు వరల్డ్ స్పేస్ రేడియో కోసం'మోహనరాగం' పేరిట 2007 లో చేసిన ప్రసంగంలో.
