రచయితలూ, కవులూ ఎవరూ పైకి ప్రకటించని ప్రజాప్రతినిధులు అన్నాడు కవి. నేనేమంటానంటే, ప్రతి రచయితా తన కంటూ ఒక వార్తాపత్రిక లేని విలేకరి. అతడు ఏ యాజమాన్యం ప్రయోజనాల కోసమూ పనిచెయ్యనవసరం లేని రిపోర్టరు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి రచయితా ప్రజల విలేకరి కావాలి. ఇదిగో ఇటువంటి రచయితల్ని చూస్తే ఆ మాట నిజమే అనిపిస్తుంది.
