ఒకప్పుడు ఉజ్జయినిలో ఉదయన పండితులుండేవారని కాళిదాసు గుర్తుచేసుకుంటాడు. సన్నిధానం అటువంటి రాజమండ్రి పండితుడు. దాదాపు వందా, నూట యాభయ్యేళ్ళ రాజమండ్రి సాహిత్య, సాంస్కృతిక చరిత్ర అతడికి కంఠోపాఠం. ఆ ముచ్చట్లు ఆయన చెప్తుంటేనే వినాలి. ఒకప్పటి రాజమండ్రిగురించి మాట్లాడటం మొదలుపెడితే ఆయన మొత్తం దేహంతో మాట్లాడతాడు. మాటమాటకీ గుండె గొంతులోకి ఉబికి వచ్చేస్తుంది.
