సాహిత్య సంకీర్తకుడు

శర్మగారు అప్పుడూ, ఇప్పుడూ కూడా ఒక నిండుగోదావరిని తనలో నింపిపెట్టుకుని ఉన్నారు. ఆయన మా ఇంట్లో కూచుని మాటాడుతున్నంతసేపూ ఆ గోదావరి తొణుకుతూనే ఉంది. చప్పుడు చేస్తూనే ఉంది. ఆయన కూచున్నంతసేపూ నాకు గోదావరి ఒడ్డున కూచున్నట్టే ఉంది. మళ్ళా శరభయ్యగారి సన్నిధిలో కవిత్వం గురించి మాటాడుకున్నట్టే ఉంది.

బసవ పురాణం-1

ముగ్ధభక్తి అనేది పాల్కురికి సోమన భారతీయ భక్తి సాహిత్యానికి అందించిన ఉపాదానంగా మనం చెప్పవచ్చు. అటువంటి ముక్త భక్తుల కథల్లో రుద్ర పశుపతి అనే భక్తుడి కథ ఈరోజు మనం విందాం.

ఆషాఢమేఘం-5

జీవితకాలం అడవుల్లో బతికినవాడికి మాత్రమే తోచగల అనుభూతి ఇది. వాన పడే మధ్యాహ్నాల్లో అడవుల అందాన్ని చూసి మనతో పంచుకున్న కవి నాకిప్పటిదాకా ప్రపంచ కవిత్వంలో మరొకరు కనబడలేదు. ఒక జూలై మధ్యాహ్నం అడ్డతీగల్లో అడవుల్లో వానపడుతున్నప్పుడు, ఈ శ్లోకమే నాకు పదే పదే గుర్తొస్తూ ఉండింది.