అలా భారతదేశపు నలుమూలలకూ చెందిన చిత్రకారులు మరో ధ్యాసలేకుండా తాము చూస్తున్న దేశాన్నీ, సమాజాన్నీ, సౌందర్యాన్నీ చిత్రించడంలోనే తలమునకలుగా ఉండే ఆ దృశ్యాన్ని చూస్తుంటే, మాకు 'ఇది కదా భారతదేశం' అని అనిపించింది. ఎప్పట్లానే ఈ జాతీయ చిత్రకళా ప్రదర్శన కూడా నాకు మరొక discovery of India గా తోచింది.
ఒక్క పాఠకుడు చాలడా!
ఆ ఎదురు చూపులు అలా నడుస్తుండగా, అమెరికాలో ఉంటున్న మిత్రులొకరు, నేనొక అమెరికన్ మహాకవి మీద రాసిన పుస్తకం చదివాననీ, ఆ పుస్తకం వల్ల తనకు మరికొన్ని పుస్తకాలు పరిచయమయ్యాయనీ చెప్తూ నా కోసం ప్రత్యేకంగా ఒక పుస్తకం తేగానే, నాకు అమెరికామీదా, ఇండియా మీదా కూడా మళ్ళా గొప్ప ఆశ చిగురించింది.
తెలుగువారందరి తరఫునా
కాబట్టి యుగయుగాలుగా తెలుగువాళ్ళు కూడబెట్టుకున్న ఆస్తుల్లో అన్నిటికన్నా ముందు పద్యాన్ని లెక్కగడతాను నేను. అమరావతి శిల్పాలూ, అజంతా చిత్రాలూ, త్యాగయ్య సంగీతమూ, కూచిపూడి నాట్యమూ ఆ తర్వాతనే.
