యుగయుగాల చీనా కవిత-16

తావో యువాన్ మింగ్ కవిత్వం చదివినప్పుడు సంస్కృత సాహిత్యవేత్తలకు వాల్మీకి, కాళిదాసులు వర్ణించిన తపోవన సంస్కృతి గుర్తొస్తుంది. తమిళ సాహిత్య విద్యార్థికి అవ్వైయ్యారూ, తిరువళ్ళువరు గుర్తొస్తారు. గ్రీకు సాహిత్య విద్యార్థికి థియోక్రిటస్ గుర్తొస్తాడు. లాటిన్ సాహిత్యవేత్తకు వర్జిల్ రాసిన ఎకొలాగ్స్ గుర్తొస్తాయి. అమెరికన్ సాహిత్యవిద్యార్థికి రాబర్ట్ ఫ్రాస్ట్ గుర్తొస్తాడు. ఇక అన్నిటికన్నా మించి తెలుగు సాహిత్యాభిమానులకు బమ్మెర పోతన గుర్తొస్తాడు. ఆయన రాసిన 'ఇమ్మనుజేశ్వరాధముల' పద్యం గుర్తొస్తుంది.

యుగయుగాల చీనా కవిత-15

కాని శతాబ్దాల తరువాత కూడా ఒక జాజిపూల తెమ్మెరలాగా, నేలరాలినా పరిమళాన్ని వీడని పారిజాతంలాగా ఆమె పద్యం మనల్ని సమ్ముగ్ధం కావిస్తూనే ఉంది.

యుగయుగాల చీనా కవిత-14

చీనా కవిత్వ సంకలనాల్లో దాదాపుగా ఆ ముందుమాటనే ఉంటుంది తప్ప ఆ కవితలు కనిపించవు. ఆ ముందుమాట లోని భావోద్వేగం ముందు ఆ కవితలు మరుగన పడిపోయాయి. కాని ఆ పూలతెమ్మెర మధ్య, ఆ తేటనీటి ఎదట ఆ కవులు ఏమి సంభావించారో తెలుసుకోవాలని ఎవరికి అనిపించదు?