ఆధునిక తెలుగు కవిత్వం క్రీస్తునొక మానవాతీత ప్రతీకగా చిత్రించడంలో ఆసక్తి చూపించింది. కాని బైరాగి క్రీస్తు జీవితంలోని అశక్తక్షణాల్ని పట్టుకున్నాడు. ఆ అశక్తక్షణాల్లో, క్రీస్తు కూడా మనలానే మామూలు మనిషిగా భావించిన క్షణాల్లో అతడి మనోవేదన ఎలా ఉంటుందో ఊహించడానికి ప్రయత్నించాడు.
అల్పక్షణిక కుసుమ కళిక
కాని, బైరాగి బాధ్యత బదులు ప్రేమ గురించి మాట్లాడేడు. నువ్వూ, నీ తోటి మానవుడూ భగవంతుడి బిడ్డలు కాబట్టి మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలనడం పూర్వయుగాలు చెప్పిన మాట. నీ తోటిమనిషికి సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా అన్యాయం జరుగుతోంది కాబట్టి నువ్వతణ్ణి ప్రేమించాలనడం ఆధునిక యుగాలు చెప్తున్న మాట.
బైరాగి 90వ పుట్టినరోజు
యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు బైరాగి కవిత్వాన్ని ఇష్టపడతారనీ, బైరాగినీ,ముక్తిబోధ్ ని పోలుస్తూ పరిశోధన చేసారనీ తెలుసు నాకు. కాని బైరాగి కవిత్వాన్ని ప్రాణాధికంగా ప్రేమిస్తారని మొన్నే తెలిసింది నాకు.
