రాయరత్న మంజూష

షేక్ స్పియర్ మీద ప్రతి ఏడాదీ కొత్త అధ్యయనాలు వచ్చినట్టే ఆముక్తమాల్యద మీద కూడా ప్రతి ఏడూ ఒక కొత్త పుస్తకం రావాలి. తెలుగునాట ప్రతి పట్టణంలోనూ కనీసం ఒకసారేనా రసజ్ఞులు నలుగురూ కూచుని ఆ కావ్యాన్ని కలిసి చదువుకోవాలి. అందులోని ఋతువర్ణనలకి ఎప్పటికప్పుడు ఇంగ్లిషులో, హిందీలో ఇతరభాషల్లో ఎప్పటికప్పుడు కొత్త అనువాదాలు రావాలి.

పూర్ణజీవి

చూడండి, చంద్రశేఖరరెడ్డిగారిని తలుచుకుంటూ ఉంటే, శ్రీకృష్ణదేవరాయలు అనే పేరు ఎన్ని సార్లు పలుకుతూ ఉన్నానో. రాయలవారు చంద్రశేఖరరెడ్డిగారి జీవితంతో అంతగా పెనవేసుకుపోయారు.