కళింగ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్

కోణార్క సూర్యదేవాలయం ఫొటోలు చూసి మిత్రులు కోణార్క గురించి రాయమని అడిగారు. ముప్పై ఏళ్ళ కిందట మాయాధర్ మానసింగ్ రాసిన 'కోణార్క' కవిత చదివినప్పణ్ణుంచీ కోణార్క చూడాలన్న కోరిక రెండేళ్ళ కిందట తీరింది. కాని ఇప్పుడు నేను ఆ కోణార్క గురించి కాక, భువనేశ్వర్ లోని మరొక కోణార్క ని పరిచయం చేయబోతున్నాను.

ఋషీవాలీ పాఠశాల

ఋషీవాలీ విద్యాసంస్థల్తో నా పరిచయం ఇరవయ్యేళ్ళ కిందటిది. యునిసెఫ్ సలహామేరకు పాడేరులోనూ, ఉట్నూరులోనూ ఆనందలహరి కార్యక్రమం అమలు చేసినప్పుడు ఋషీవేలీ రూరల్ స్కూల్ వారు రూపొందించిన కరికులం ని మేం గిరిజన ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసాం. ఆ కరికులం కింద రూపొందించిన కృత్యపత్రాల్ని నేరుగా వాడకుండా వాటిని గిరిజన సంస్కృతికీ, గిరిజన సమాజానికీ సన్నిహితంగా ఉండేలా సరిదిద్దుకుని మరీ అమలుచేసాం. 

మళ్ళా ఇన్నాళ్ళకి పార్వతీపురం దారుల్లో

1967-71 ప్రాంతాల్లో శ్రీకాకుళం గిరిజనప్రాంతాల్లో తలెత్తిన తిరుగుబాటు, అలజడీ పార్వతీపురం గిరిజన ప్రాంతాల్లోనే ప్రధానంగా సంభవించేయి. ఆ తర్వాత ఇరవయ్యేళ్ళ్ళకి, అంటే, 1987 లో నేను జిల్లా గిరిజనసంక్షేమాధికారిగా ఉద్యోగంలో చేరినప్పుడు పార్వతీపురం గిరిజనప్రాంతాల్లోనే ట్రైనింగూ, మొదటి పోస్టింగూ కూడా. అక్కణ్ణుంచి అనూహ్యపరిస్థితుల్లో 1990 లో ఆ జిల్లా వదిలిపెట్టి వచ్చేసినదాకా,ఆ అడవుల్లో నేను తిరగని చోటులేదు, ఎక్కని కొండలేదు.