పన్నెండుమంది ఆళ్వారుల్లో ఒకరైన ఆండాళ్ (క్రీ.శ.9 వశతాబ్ది) రచించిన తిరుప్పావై భారతీయసాహిత్యంలోని అత్యంతవిలువైన కృతుల్లో ఒకటి. తదనంతరసాహిత్యాన్ని అపారంగా ప్రభావితం చేసిన రచన. అక్కమహాదేవి, మీరా, లల్ల, మొల్ల వంటి ప్రాచీనకవయిత్రులతో పాటు సరోజినీనాయుడు, తోరూదత్, మహాదేవీవర్మవంటి ఆధునిక కవయిత్రులదాకా ఎందరో భావుకులకూ, రసపిపాసులకూ, జీవితప్రేమికులకూ ఆండాళ్ దే ఒరవడి.
ఆ సంతోషసంభ్రమం అలాంటిది
మహాశివరాత్రి. శివుడూ, శివరాత్రీ నాలో జన్మాంతర జ్ఞాపకాలతో పాటు, ఇంతదాకా బతికిన బతుకులో కూడా అత్యంత విలువైన క్షణాల్ని మేల్కొల్పుతాయి.
దేవీసప్తశతి
మా కాలనీలో ప్రసన్నాంజనేయస్వామి గుళ్ళో చండీయాగం చేస్తున్నాం, ఏదన్నా మాట్లాడండి అనడిగితే దేవీసప్తశతి మీద కొంతసేపుమాట్లాడేను. ఎప్పుడో ఇరవయ్యేళ్ళకిందట కర్నూల్లో ఉండగా మా మాష్టారు హీరాలాల్ గారు ఆ పుస్తకం మీద వ్యాఖ్యానమొకటినాతో చదివించారు.
