ఇప్పుడు ఈ కవిత మళ్ళా చూసేక నా మనసుకి మరీ అగమ్యంగా ఉంది. ఈ కవిత రాసినామే, ఇలా మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినామే ఒక్కరేనా?
కవికోకిల
కవులు పుట్టవచ్చు. కళాకారులు పుట్టవచ్చు. కానీ తన హృదయాన్నీ, రసననీ, మొత్తం జీవితాన్నీ పద్యానికి పల్లకిగా మార్చుకుని వూరేగించగలవాళ్ళు మాత్రం ఇక ముందు తరాల్లో పుడతారనుకోను. నాకు తెలిసి ఆ పద్య గంధర్వుల్లో చివరివాడు కవితాప్రసాద్.
శ్రీ లక్ష్మణమూర్తి
శ్రీ లక్ష్మణమూర్తిగారు ఇటీవల స్వర్గస్థులయ్యారన్న వార్త చాలా ఆలస్యంగా తెలిసింది. ఆయన్ని నేను ఒకే ఒక్కసారి కలుసుకున్నాను, అది కూడా ఇరవయ్యేళ్ళ కిందట. కానీ ఆ ఒక్క సమావేశమే ఆయనతో ఒక జీవితకాలం గుర్తుపెట్టుకునే సాహిత్యానుభవాన్నిచ్చింది. ఆ విశేషాలు అప్పట్లో తెలుగు ఇండియా టుడే లో 'సాలోచన' లో పంచుకున్నాను. ఆ తర్వాత ఆ వ్యాసం 'సోమయ్యకు నచ్చిన వ్యాసాలు' పుస్తకంలో పొందుపరిచాను. ఇప్పుడు ఆయనకు నివాళిగా ఆ వ్యాసాన్నిక్కడ మరోమారు మీతో పంచుకుంటున్నాను.
