ఈ నెల 17 వ తేదీ బుధవారం విజయనగరంలో డా. ఉపాధ్యాయుల అప్పలనరసింహమూర్తిగారి రచన 'ఆధునిక తెలుగు శైలి ' పుస్తకాన్ని గురజాడకీ,గిడుగుకీ అంకితమివ్వడం కోసం ఏర్పాటు చేసిన సభ. వారి తరఫున మండలి బుద్ధప్రసాద్ గారు స్వీకరించారు. గొల్లపూడి మారుతీరావుగారు అధ్యక్షత వహించిన ఆ సభలో ఆ పుస్తకం మీద నేను మాట్లాడాలని నరసింహమూర్తిగారి కోరిక.
కారామాష్టారూ, చినువా అచెబె
ఈ నెల 3 వ తేదీన లా మకాన్ లో అనంతమూర్తిమీద ఒక డాక్యుమెంటరీ ప్రదర్శిస్తూ నన్ను కూడా మాట్లాడమని అడిగినప్పుడు, సంస్కార కన్నా గొప్ప రచనలు తెలుగులో వచ్చినప్పటికీ వాటి గురించి తక్కిన ప్రపంచానికి తెలియడం లేదని అన్నాను. ఆ మాటల మీద కొంత చర్చ జరిగింది.
సౌందర్యోపాసకుడు
ఆదివారం తెనాలిలో సంజీవదేవ్ శతజయంతి సభ. సాహిత్య అకాదెమీ నిర్వహించిన సభలో రోజంగా సంజీవదేవ్ కృషిమీద పెద్దలెందరో పత్రాలు సమర్పించారు. సాయంకాలం జరిగిన సమాపనోత్సవంలో సమాపనోపన్యాసం చేసే అరుదైన గౌరవం నాకు లభించింది.
