నేషనల్ బుక్ ట్రస్ట్ వారి స్టాలు

మిత్రులారా, మీ దగ్గర వంద రూపాయలు మాత్రమే ఉన్నా,అత్యద్భుతమైన పుస్తకాలు దొరికే చోటు నేషనల్ బుక్ ట్రస్ట్ వారి స్టాలు. అక్కడ కురతలైన్ హైదర్ రాసిన 'అగ్నిధార' దొరుకుతుంది. కురతలైన్ అగ్రశ్రేణి ఉర్దూ రచయిత్రి, జ్ఞానపీఠ పురస్కార స్వీకర్త.

బైరాగి 90వ పుట్టినరోజు

యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు బైరాగి కవిత్వాన్ని ఇష్టపడతారనీ, బైరాగినీ,ముక్తిబోధ్ ని పోలుస్తూ పరిశోధన చేసారనీ తెలుసు నాకు. కాని బైరాగి కవిత్వాన్ని ప్రాణాధికంగా ప్రేమిస్తారని మొన్నే తెలిసింది నాకు.

ఒక జీవుడి ఇష్టం

గురజాడ, గాంధీ, విశ్వనాథ వంటివారి భావాల్లో సారూప్యత లేకపోయినప్పటికీ, వాళ్ళందరిలోనూ ఉమ్మడిగా కనవచ్చే అంశం, మాడర్నిటీని ధిక్కరించడమే. మాడర్నైజేషన్ ని ఒక కలోనియల్ ప్రక్రియగా నిదానించడంలో వారి జాగరూకత సరైనదేనని ఇప్పుడు మనకి తెలిసి వస్తున్నది.