కాని ఇప్పుడు నిజమైన ప్రార్థన అంటే ఏమిటో తెలిసింది. తెల్లవారి లేచి నువ్వు దైవాన్ని ఏమీ కోరుకోనక్కర్లేదు. నువ్వు చెయ్యవలసిందల్లా ధన్యవాదాలు చెప్పుకోవడమే. మరొక ప్రభాతం నీకు లభించినందుకు. మరొక రోజు నీకు దక్కినందుకు. మరొకసారి దైవాన్ని తలుచుకోగలినందుకు.
మంత్రాలయసన్నిధిలో
గతంలో ఎన్నో సార్లు మంత్రాలయం వెళ్ళినా ఎన్నడూ లేనట్టుగా ఈ సారి స్వామి సన్నిధి మరింత సన్నిహితంగా తోచింది. అన్నిటికన్నా ముందు ఆయన ముందొక కవి అనీ, నాబోటి వాళ్ళ వేదనకొక గొంతునిచ్చాడనీ అర్థమయింది.
ఫాల్గుణమాసపు మామిడి పిందె
ఈ కవిత ఇప్పుడు కలకత్తాకి చేరిందంటే నాకు చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మనుషుల్ని ప్రేమించడం ఒక స్వభావంగా మారినవాళ్ళు తప్ప మరొకరెవరూ ఈ సున్నితస్పందనని గమనించలేరు, గమనించినా ఇలా ఒక పతాకలాగా పైకి ఎగరెయ్యలేరు.
