నా భాగ్యం

ఈ గీతాన్ని ఆత్మీయురాలు నిర్మలకి కానుక చెయ్యడం కూడా భగవత్సంకల్పంగానే భావిస్తున్నాను. రెండువేల అయిదు వందల ఏళ్ళ యూదీయ, క్రైస్తవ, భగవద్విశ్వాసుల ఆశీస్సులు ఆమెకు ఈ రూపంలో అందుతున్నాయని నమ్ముతున్నాను. ఈ పుస్తకానికి ఆమెనే మొదటి పాఠకురాలు కూడా. ఆమె తన స్పందనను ఇలా పంచుకున్నారు. ఈ కానుకని ఆమె అంగీకరించడం నా భాగ్యంగా భావిస్తున్నాను.

జాగరాలమ్మ

మేము ఆ ఊరు వెళ్తామని తెలిసి సోమశేఖర్ తాను కూడా వస్తానన్నాడు. రావడమే కాదు, తనే తన కారుమీద మమ్మల్ని ఆ ఊరు తీసుకువెళ్ళి తీసుకొచ్చాడు. ఆ రోజు అతడు కూడా ఆ గిరిజనదేవతను దర్శించుకున్నాడు. కాని అతడి హృదయంలో ఇన్ని రసతరంగాలు ఎగిసిపడుతున్నాయని నేను ఊహించలేకపోయాను.

మందం మందం మధుర నినదైః

ఏమా అని తెరిచి చూద్దును కదా, గోదావరి గళం నుంచి ప్రవహిస్తున్నట్టు, మాష్టారి కంఠస్వరంలో కృష్ణకర్ణామృత శ్లోకాలు. అలానే వింటూ ఉండిపోయాను. సాయంకాల ప్రార్థన పూర్తయిందనిపించింది.