ఆ క్షేత్రం ఒక పూట వెళ్ళి వచ్చేదికాదనీ, కనీసం ఒక వెన్నెల రాత్రి, ఒక శుభప్రభాతం అక్కడ ఉండవలసిందనీ అనిపించింది.
సంతోషంతో ఓపిక పట్టడం
ఆ కేంద్రానికి వెళ్ళి చూసాను. ఆ భవనసముదాయం, అక్కడి పరిశుభ్రత, ఆ నిబద్ధత నన్నెంతో ఆకట్టుకున్నాయి. 'నాకు తెలిసి కొంత మంది ఎంతో పెద్ద మనసుతో వృద్ధాశ్రమాలు మొదలుపెట్టి నడపలేక చేతులెత్తేసారు. మీరు నడపగలుగుతున్నారు ఏమిటి కారణం?' అనడిగాను అతణ్ణి.
ఆ మందహాసాన్ని ఒక్కసారి చూడటానికేనా
సహ్యాద్రి అంతటా వ్యాపించిన దత్తసంప్రదాయం, పండరిపురం కేంద్రంగా విలసిల్లిన విట్ఠల సంప్రదాయం, సంత్ భక్తి వాగ్గేయకారుల కీర్తన సంప్రదాయం, వార్కరి, మహానుభావ సంప్రదాయం, నాథ సంప్రదాయం, మరొకవైపు దక్కన్ ని వెలిగించిన సూఫీ సంప్రదాయం ఇవ్వన్నీ సాయిబాబాలో సంగమించించాయి.
