ఒక పట్టణం మహానగరంగా మారిందని ఎప్పుడు చెప్పగలం? ఆ ఊళ్ళో నీటిరంగుల చిత్రలేఖనసామగ్రి దొరికినప్పుడు అని చెప్తాన్నేను.
మనోజ్ఞస్వప్నాలు
శతాబ్దాలకిందటి ఏ పారశీక కళాకారులో, చిత్రకారులో అతడితో నిత్యం సంభాషణ కొనసాగిస్తూ ఉంటారనుకుంటాను. ఇక్కడ పొందుపరిచిన రెండుమూడు నమూనాలు చూడండి. ఆ నెమలి, ఆ ఏనుగు, ఆ కొంగలు- ఇవి కాగితం మీద గీసిన బొమ్మలు కావు, చెక్కమీద చెక్కిన శిల్పాలు, ఇంకాచెప్పాలంటే పాలరాతిమీద ముద్రించిన మనోజ్ఞస్వప్నాలు.
సర్వశ్రేష్ఠ మీనియేచర్ చిత్రకారుడు
ఒకసారి నేనాయనతో 'మీరు హిమాలయాల్ని అజరామరం చేసారు' అని అంటే, ఆయన చిరునవ్వి 'లేదు, నువ్వు పొరబడుతున్నావు దేవ్, హిమాలయాలే నన్ను అజరామరం చేసాయి' అన్నాడు.'
